శంషాబాద్ మార్గంలో 10 వేల మందితో సడక్ బంద్
హైదరాబాద్: ఫిబ్రవరి 24న శంషాబాద్ విమానాశ్రయ మార్గంలో సడక్బంద్ నిర్వహించాలని తెలంగాణ ఐకాస నిర్ణయించింది. 10 వేలమందితో శంషాబాద్ వద్ద కర్నూలు జాతీయ రహదారిని నిర్బంధిస్తామని ఐకాస ఛైర్మన్ కోదండరాం, ఉద్యోగ సంఘాల నేత శ్రీనివాస్గౌడ్ ప్రకటించారు. యూపీఏ సర్కారు తెలంగాణపై మాట తప్పడం వల్లే మరోసారి ఉద్యమానికి సిద్ధమవుతున్నాట్లు తెలిపారు.