అంకిళ్ల నుంచి చంద్రబాబు పాదయాత్ర ప్రారంభం

మహబూబ్‌నగర్‌ : వస్తున్నా మీకోసం పాదయాత్ర గత పన్నెండు రోజులుగా జిల్లాలో కొనసాగుతోంది. టీడీపీ సీనియర్‌నాయకులు, పొలిట్‌ బ్యూరో సభ్యుడు కింజారావు ఎర్రన్నాయుడు రోడ్డు ప్రమాదంలో దుర్మణం చెందడంతో ఆయన అంత్యక్రియలకు హాజరయిన బాబు రెండు రోజులు పాదయాత్రను నిలిపివేసిన అనంతరం రెండు రోజులుగా జిల్లాలో పాదయాత్ర చేపట్టారు. ఇందులోభాగంగా బుధవారం కోయిల్‌కొండ మండలం అంకిళ్ల నుంచి యాత్రను బాబు ప్రారంభించారు. పెద్దసంఖ్యలో అభిమానులు, కార్యకర్తలు పాదయాత్రలో పాల్గొన్నారు. ఖాజీపూర్‌, నల్లపల్లి, బూర్గుపల్లి గేటు మీదుగా కొతలాబాద్‌ వరకూ పాదయాత్ర జరుగుతుందని పార్టీవర్గాలు తెలిపాయి.