అంగన్వాడీ కేంద్రాలకు పక్కా నిర్మాణాలు చేపట్టాలి

జనం సాక్షి చండ్రుగొండ (జూన్ 08)మండల కేంద్రంలోని అంగన్వాడీ కేంద్రాలకు  పక్కా  బిల్డింగ్ నిర్మాణాలు చేపట్టాలని సీపీఎం మండల నాయకులు కోరారు. ఈ మేరకు మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో పాల్గొని  ఎంపీడీఓ అన్నపూర్ణకు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా సిపిఎం  మండల కమిటీ సభ్యుడు వేణు   మాట్లాడుతూ చిన్న పిల్లలు చదువుకునే అంగన్వాడీ కేంద్రాలలో  సరైన వసతి సౌకర్యాలు లేక  నానా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అధికారులు స్పందించాలని కోరారు. మండల కేంద్రంలో సరైన డ్రైనేజీ సౌకర్యాలు లేక  రానున్న వర్షాకాలంలో నానా ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంటుందని జూలూరుపాడు ప్రధాన రహదారిపై  వర్షపు నీరు నిల్వ ఉండి ఇళ్లల్లోకి చేరుతుందన్నారు. ఈ విషయమై గతంలో అనేకసార్లు  అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా  ఫలితం లేకపోయిందన్నారు. తక్షణం డ్రైనేజీ సమస్య తీర్చాలని  డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో  సిపిఎం మండల కమిటీ సభ్యులు విప్పర్ల  పెద్ద వెంకటేశ్వర్లు, రాయ్ రాజా, అంతేకాదు చల్లపల్లి రాజా, దాసరి సీతారాములు తదితరులు పాల్గొన్నారు.