*అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం*

ఇటిక్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 20
 మండల పరిధిలోని బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో మంగళవారం సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. పునర్వసు నక్షత్రం సందర్భంగా నిర్వహించే సీతారాముల కళ్యాణం మహోత్సవానికి మండల కేంద్రంతో పాటు కొండపేట, యాక్తాపురం, ఎర్రవల్లి చౌరస్తా, షేక్ పల్లి, జింకలపల్లి, కొండేరు, కోదండాపురం, సాసనూలు, దువాసిపల్లి, ఆర్. గార్లపాడు పెద్దదిన్నె తదితర గ్రామాల నుండి భక్తులు బీచుపల్లి పుణ్యక్షేత్రానికి చేరుకున్నారు. దక్షిణ వాహిని అయినా కృష్ణానదిలో పుణ్య స్నానాలు ఆచరించి అక్కడ ఉన్న శివాలయం, శ్రీ అభయాంజనేయస్వామి, జ్ఞానసరస్వతి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి, సీతారాముల కల్యాణోత్సవంలో పాల్గొన్నారు. భక్తులకు షేక్ పల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్ రెడ్డి అన్నదాన, స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించినట్లు ఆలయ మేనేజర్ సురేందర్ రాజు తెలిపారు.