అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి

అల్వాల్ సర్కిల్ మచ్చ బొల్లారం డివిజన్ తోట పెంటా రెడ్డి గార్డెన్స్ లో బొల్లారం నగర సేవాసమితి ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సురేష్ సేవాసమితి వ్యవస్థాపకులు సురేష్ యోగ ఆచార్యులు బల్వంత్ సింగ్ తో హాజరై భారతమాత చిత్రపటానికి దూప ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నార్లసురేష్ మాట్లాడుతూ ప్రతిరోజు దినచర్య లో కొంత సమయం యోగ సాధనకు కేటాయిస్తే బ్రహ్మ రాసిన రాతలో మన ఆయుష్ ను సైతం యోగ సాధన పెరుగుతుంది అంతేకాకుండా మనకు ఆరోగ్యాన్ని తెలివితేటల్ని చురుకుదనాన్ని జీవితం హాయిగా సాగిపోయేటట్లు తోడ్పడుతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో అభినాష్, పద్మ కుమార్, రాజ్ కుమార్, శివరాజ్ సాయిబాబా, కే రాజయ్య, అంజి రెడ్డి, ధనరాజ్, తదితరులు పాల్గొన్నారు.