అంత్యక్రియల నిమిత్తం ఆర్థిక సహాయం అందించిన బి.ఎస్.పి నియోజకవర్గ ఇన్చార్జ్ సీఎం నర్సింలు

నియోజకవర్గ పరిధిలో నిరుపేద కుటుంబాలు మరణిస్తే వారి కుటుంబాలకు ఆర్థిక భారం పడకూడదన్న ఉద్దేశంతో వారికి అండగా నిలుస్తూ అంత్యక్రియల నిమిత్తం కుటుంబానికి తనకు తోచిన సహాయం అందించి ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు ఆయన ఎవరో కాదు వికారాబాద్ నియోజకవర్గంలోని సిరిపురం గ్రామానికి చెందిన సీఎం నర్సింలు బీఎస్పీ నియోజకవర్గ ఇన్చార్జి గా ఉన్నారు పేద ప్రజల కు ఏదైనా చేసి వారికి అండగా నిలవాలని ఆయన లక్ష్యం అందులో భాగంగానే బుధవారం
మోమిన్ పేట మండలం యేన్కపల్లి గ్రామంలో కొనా రాములు అనారోగ్యం కారణంగా మరణించడంతో అయన కుటుంబాన్ని కలిసి ఓదార్చి అయన  అంతిమ యాత్రకు ఆర్థిక సహాయంగా సీఎం నర్సింలు సొంత నిధులతో 5000రూపాయలు కుటుంబానికి ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో గుట్ట మీది రాములు మండల బీఎస్పీ అధ్యక్షులు కొ లు కుందా రాజు,గణేష్,ప్రవీణ్, శేఖర్,రామకృష్ణ బొంబాయి  రాజు తదితరులు పాల్గొన్నారు