అందరి సహకారంతో అభివృద్ధి పనులు

సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన మేయర్ బుచ్చిరెడ్డి
మేడిపల్లి – జనంసాక్షి
అందరి సహకారంతో దశలవారీగా అభివృద్ధి పనులు చేపడుతూ కార్పొరేషన్ అభివృద్ధికి కృషి చేస్తున్నామని బోడుప్పల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి అన్నారు. బోడుప్పల్ నగరపాలక సంస్థ 1వ డివిజన్ పరిధిలోని జయశ్రీ కాలనీలో స్థానిక కార్పొరేటర్ బింగి జంగయ్య యాదవ్ ఆధ్వర్యంలో 40 లక్షల రూపాయలతో నిర్మించనున్న సీసీ రోడ్ పనులకు టెంకాయ కొట్టి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పనులు కొనసాగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీ రవి గౌడ్, కార్పొరేటర్ కొత్త చందర్ గౌడ్, కో ఆప్షన్ సభ్యులు రంగా బ్రహ్మన్న గౌడ్, డివిజన్ నాయకులు, కాలనీ ప్రెసిడెంట్, సెక్రెటరీ కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.
Attachments area