అందరి సహకారంతో రెడ్ క్రాస్ బలోపేతం

జిల్లా వైస్ చైర్మన్ 
దోమకొండ మండల కేంద్రంలో గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా వైస్ చైర్మన్ అంకన్నగారి నాగరాజ్ గౌడ్ చేతుల మీదుగా దోమకొండ జెడ్పిటిసి తిరుమల్ గౌడ్ వేయి రూపాయలు చెల్లించి రెడ్ క్రాస్ సొసైటీ జీవితకాల సభ్యత్వం వెయ్యి రూపాయలు చెల్లించి  తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా వైస్ చైర్మన్ అంకన్నగారి నాగరాజ్ గౌడ్ మాట్లాడుతూ సామాజిక సేవ చేయాలనే ఉద్దేశం కలిగిన ప్రతి ఒక్కరు రెడ్ క్రాస్ సభ్యత్వం తీసుకోవాలని కోరారు నూతనంగా సభ్యత్వం పొందిన వారికి,ఇప్పటి వరకు ఉన్న  సొసైటీ సభ్యులందరి వారి పూర్తి వివరాలు మండల కమిటీ సేకరించి అందరకీ త్వరలోనే గుర్తింపు కార్డులు కూడా అందజేయడం జరుగుతుందన్నారు.కామారెడ్డిజిల్లా వ్యాప్తంగా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రాష్ర్ట రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో పెద్ద ఎత్తున పలు సేవా కార్యక్రమాలను,రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్ననామని రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లా ముందంజలో వుందన్నారు అలాగే పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలని జిల్లా చైర్మన్ రాజన్న ఆదేశాల మేరకు మండలాల వారీగా సభ్యత్వ నమోదు కార్యక్రమం  చేపడుతున్నామన్నారు నూతనంగా రెడ్ క్రాస్ సభ్యత్వం పొందిన జెడ్పీటీసీ తిరుమల్ గౌడ్ మాట్లాడుతూ  రెడ్ క్రాస్ సొసైటీ కి మా సహకారం ఎల్లప్పుడూ వుంటుందన్నారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ నల్లపు అంజలి శ్రీనివాస్, ఎంపీపీ కానుగంటి శారద నాగరాజు, రెడ్ క్రాస్ సొసైటీ డివిజన్ వైస్ చైర్మన్ పున్న లక్ష్మణ్, డివిజన్ కమిటీ సభ్యులు వినోద్ కుమార్, మండల కమిటీ సభ్యులు సహదేవ్, సాప శ్రీనివాస్, బత్తిని సిద్దరాములు, పాల్గోన్నారు