అకాలీదళ్‌ విద్యార్థి నేత దారుణహత్య

వెంబడిరచి కాల్పులు జరిపిన దుండగులు
చండీఘడ్‌,ఆగస్ట్‌7(జనంసాక్షి):పంజాబ్‌లోని మొహాలీలో శనివారం మధ్యాహ్నం దారుణం జరిగింది. నడిరోడ్డుపై అకాలీదళ్‌ విద్యార్థి నేత విక్కీ మిద్దుఖేరను గుర్తు తెలియని దుండగులు కాల్చిచంపారు. ఈ
ఘటనపై మొహాలీ ఎస్పీ సతీందర్‌ సింగ్‌ స్పందించారు. మతౌర్‌ మార్కెట్‌కు వచ్చిన విక్కీ కారులో తిరుగు పయనం అవుతుండగా దుండగులు అతినిపై కాల్పులు జరిపారు. అప్రమత్తమైన విక్కీ కారు దిగి పారిపోయేందుకు యత్నించాడు. అర కిలోవిూటర్‌ వరకు విక్కీ పరుగు పెట్టాడు. ఈ క్రమంలో విక్కీని వెంటాడి కాల్పులు జరిపి హత్య చేశారు. అతన్ని నలుగురు దుండగులు వేటాడి చంపారు. విక్కీపై 8 నుంచి 9 రౌండ్ల కాల్పులు జరిపారు అని మొహాలీ ఎస్పీ పేర్కొన్నారు. విక్కీ హత్యపై విచారణ కొనసాగుతోందని తెలిపారు.