అచ్చంపేట లో నకిలీ భాట్ల తో ప్రజలను మోసం చేస్తున్న మటన్, చేపల వ్యాపారులపై కేసులు నమోదు.

అచ్చంపేట ఆర్సీ, సెప్టెంబర్ 18(,జనం సాక్షి న్యూస్) :- స్థానిక అచ్చంపేట పట్టణంలో తప్పుడు తుకాలతో ప్రజలను మోసం చేస్తున్న చేపల ,మటన్  వ్యాపారులపై  జిల్లా తూనికలు,కొలతలు అధికారులు  కేసులు నమోదు చేశారు.జిల్లా తూనికల అధికారులు పట్టణంలో ఆదివారం సుమారు పది మంది వ్యాపారులపై జరిపిన తునీకల తనిఖీ లలో ఇద్దరు మటన్, చేపలు అమ్ముకొనే వ్యాపారులు  కిలో భాటు  తో జోకుతూ 750 గ్రాములే ఇస్తూ ఇలా వివిధ రకాలుగా వినియోగదారుల ను మోసం చేస్తూ పట్టుబడ్డారు.వీరిలో ఒకరిపై వెయ్యి జరిమానా విధించి కేసు నమోదు చేశామని ,అదేవిధంగా  నకిలీ తప్పుడు భాట్లను సీజ్ చేశామని జిల్లా అధికారి రామ్మోహన్ తెలిపారు.