అజ్మీర్ దర్గాకు చాదర్ పంపిన సోనియా
న్యూఢిల్లీ, మే 12 (జనంసాక్షి) :ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రఖ్యాత అజ్మీర్ దర్గాకు ఆదివారం చాదర్ పంపారు. అజ్మీర్లోని ఖాజా మొయినొద్దీన్ చిస్తీ దర్గాలో ఆయన 801వ వర్ధంతి ఉత్సవాలు శుక్రవారం ప్రారంభమైన విషయం తెలిసిందే. లక్షలాది మంది ముస్లింలు ఈ వేడుకలో పాలుపంచుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున సోనియాగాంధీ చాదర్ను పంపి, ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు.