అధికారులను నిలదీసిన గ్రామస్థులు

కోడేరు: మండల పరిధిలోని ఖానాపూర్‌ గ్రామంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ప్రత్యేక అధికారుల బృందాన్ని గ్రామస్థులు శుక్రవారం నిలదీశారు. ఖానాపూర్‌ గ్రామంలో ప్రత్యేక అధికారి తిమ్మారెడ్డి ఆధ్వర్యంలో ‘పల్లెవికాసం’ కార్యక్రమం నిర్వహించారు. తాగునీరు, విద్యుత్తు, పారిశుద్ధ్యం సమస్యలు తీర్చాలని గతంలో అధికారులకు చెప్పినా ఎవ్వరూ పట్టించేకోలేదని గ్రామస్థులు వాపోయారు. ఎంపీడీవో సువర్ణ, తహశీల్దార్‌ ఏసయ్య స్పందిస్తూ వారం రోజుల్లో సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండలశాఖ అధికారులు పాల్గొన్నారు.