అన్ని సర్వేలు టిఆర్‌ఎస్‌కే అనుకూలం

 

మళ్లీ కెసిఆరే సిఎం కానున్నారు

తెలంగాణలో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పాటు ఖాయం

ప్రచారంలో మాజీ స్పీకర్‌ మధుసూధనాచారి

భూపాలపల్లి,నవంబర్‌27(జ‌నంసాక్షి): గ్రామాల్లో ఎన్నికల సర్వేలు జరిపిన ప్రతీ సంస్థ మళ్లీ కేసీఆరే సీఎం అని తేల్చాయని మాజీ స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. టీఆర్‌ఎస్‌కు పట్టం గట్టేందుకు ఓటర్లు ఉవ్విళ్లూరుతున్నారన్నారు.60 ఏళ్లు పాలించిన టీడీపీ, కాంగ్రెస్‌లు కూటమి అనే కొత్త వేషంతో మళ్లీ తెలంగాణను దోచుకోవడానికి, తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవ డానికి ముందుకు వస్తున్నాయన్నారు.

టీడీపీ, కాంగ్రెస్‌ కూటమి కుట్రలను తిప్పి కొడుతూ తెలంగాణ తడాఖా చూపించాలని పిలుపునిచ్చారు. భూపాలపల్లి పరిధిలోని పలు గ్రామాల్లో ఆయన ప్రచారం నిర్వహించారు. జిల్లాను తెచ్చి ప్రజలకు వరంగల్‌కు వెళ్లే ఇబ్బందులను తొలిగించానని తెలిపారు. తన స్థానంలో ఏ ఎమ్మెల్యే ఉన్నా జిల్లా వచ్చేది కాదని స్పష్టం చేశారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను అభివృద్ధి చేస్తూ అన్ని వర్గాల అభిమానం చూర గొన్న సీఎం కేసీఆర్‌ ప్రజల గుండెచప్పుడుగా మారాడని అన్నారు. తెలంగాణను దోచుకున్న కాంగ్రెస్‌, ద్రోహం చేసిన, చేస్తున్న టీడీపీలకు ఈ ఎన్నికల్లో ఘోరీ కట్టడం ఖాయమన్నారు. దేశంలో ఎక్కడాలేని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తూ నేడు కేసీఆర్‌ దేశానికే ఆదర్శంగానిలిచారని కొనియాడారు. ఇంతచేసిన టీఆర్‌ఎస్‌కు అధిక సంఖ్యలో ఓట్లువేసి కేసీఆర్‌ను మళ్లీ సీఎం, తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. కేసీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కోలేకనే చంద్రబాబును తెలంగాణకు తెస్తున్నారని అలాంటి కాంగ్రెస్‌ పార్టీకి డిపాజిట్లు రానివ్వకుండా ఓటుతో బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు.

తెలంగాణ విూద మళ్లీ ఆంధ్రా సీఏం చంద్రబాబునాయుడు పెత్తనం అవసరమా అని నియోజకవర్గ ప్రజలు ఆలోచించాలన్నారు. చంద్రబాబును భుజాల విూదకు ఎత్తుకుని తీసుకొస్తున్న కాంగ్రెస్‌ నేతలపై ఆయన మండిపడ్డారు. అలాటి వారిని చిత్తుగా ఓడించి రాజకీయంగా తరిమికొట్టాలని పిలుపుచ్చారు. సీట్లు పంచుకునే దమ్ములేదు కానీ టీఆర్‌ఎస్‌ పార్టీని ఓడిస్తారా.. అని ఎద్దెవా చేశారు. మంచినీళ్ల నుంచి మద్యం వరకు సిండికేటు రాజకీయాలు చేసే నీచ చరిత్ర కాంగ్రెస్‌ పార్టీది, వారి హయాంలోనే నియోజకవర్గ ప్రజలకు తాగునీటి కష్టాలు వచ్చాయని మండిపడ్డారు. 60 ఏండ్లలో జరగని అభివృద్దిని నాలుగేండ్లలో సీఏం కేసీఆర్‌ చేసి చూపించాడమని అన్నారు. కాంగ్రెస్‌, టీడీపీ హయాంలో ప్రజలు కరంట్‌ కష్టాలు అనుభవించారని, కానీ తెలంగాణ ప్రభుత్వం 24గంటల కరంట్‌ ఇస్తూ వారి కష్టాలను కడతేర్చిందని అన్నారు. దేశంలో నంబర్‌వన్‌ రాష్ట్రంగా తీర్చిదిద్దుతున్న కేసీఆర్‌కు జనం నీరాజనం పడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. పచ్చగ కళకళలాడుతున్న తెలంగాణను ఆం ధ్రా నాయకులతో కలిసి మలినం చేసేందుకు ప్రయత్నం చేస్తున్న కూటమిని కూలదోలి బంగారు తెలంగాణ సాధనకు కృషి చేయాలన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చెప్పిందే చేస్తుందని అబద్దాలు అడే సంస్కృతి మాకు లేదని ఆయన పునరుద్ఘాటించారు.