అపోలో గ్రూప్స్ చైర్మన్ ప్రతాప్ రెడ్డికి గాయాలు
హైదరాబాద్, జనంసాక్షి: అపోలో గ్రూప్స్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి దుబాయిలో ప్రమాదవశాత్తు గాయపడ్డారు. ఆయన కుడి చేతికి , కుడి కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రతాప్ రెడ్డి అక్కడి నుంచి విమానంలో హైదరాబాద్కు తీసుకువచ్చారు. తెల్లవారుజాము రెండున్నర గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రతాప్రెడ్డిని ఆయన కుటుంబ సభ్యులు ఆపునత్రికి తరలించారు. అయితే ప్రమాదానికి గల కారణాలను మాత్రం చెప్పలేదు.