అప్పు అడిగిన పాపానికి గొంతుకోసి హత్య

విశాఖపట్టణం,జూలై23(జనంసాక్షి): విశాఖ జిల్లాలో ఓ రౌడీ షీటర్‌ రెచ్చిపోయాడు. అప్పు ఇచ్చిన పాపానికి అతడిని దారుణంగా హత్య చేసి పారిపోయాడు. విశాఖ జిల్లా ఎంవీపీ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో అప్పల రెడ్డి అనే వ్యక్తి శంకర్‌ అనే రౌడిషీటర్‌కు అప్పు కింద రూ. 500 ఇచ్చాడు. ఇచ్చిన అప్పును తిరిగి ఇవ్వాలని కోరగా నిన్న అర్ధరాత్రి మద్యం తాగి వచ్చిన రౌడీ షీటర్‌ పెదవాల్తేర్‌ మునసాబు వీధిలో కత్తితో గొంతుకోసి అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్రంగా గాయపడ్డ బాధితుడు శంకర్‌ సంఘటన స్థలంలోనే మృతి చెందాడు.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌?కు తరలించారు.