అప్రకటిత కోతలకు నిరసనగా ప్రశాంతంగా కొనసాగుతున్న బంద్‌

నల్గొండ(అర్బన్‌) : పెరిగిన విద్యుత్తు ఛార్జీలు, అప్రకటిత కోతలకు నిరసనగా వామపక్షాలు ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో బంద్‌ ప్రశాంతంగా కొనసాగుతుంది. ప్రధాన పార్టీలైన తెదేపా, భాజపా, తెరాస, సీపీఐ, సీపీఎంలతోపాటు ఐకాస నాయకులు కూడా బంద్‌లో పాల్గొన్నారు. ఆర్టీసీ బస్సులతోపాటు సినిమా థియేటర్లు, వ్యాపార, విద్యాసంస్థలు మూతపడ్డాయి.