అఫ్ఘాన్‌లో యుద్దం ముగిసింది

తాలిబన్‌ రాజకీయ ప్రతినిధి ప్రకటన
కాబూల్‌,ఆగస్ట్‌16(జనంసాక్షి): ఆఫ్ఘనిస్తాన్‌లో యుద్ధం ముగిసిందని తాలిబన్‌ రాజకీయ ప్రతినిధి ప్రకటించారు. అంతర్జాతీయ సమాజంతో శాంతియుత సంబంధాలకు పిలుపునిచ్చారు. తాలిబన్‌లు ఒంటిరిగా జీవించాలనుకోవడంలేదని, పాలనా విధానం, వ్యవహారాలు త్వరలో స్పష్టమవుతాయని ప్రతినిధి మొహమ్మద్‌ నయిం విూడియాకు తెలిపారు. షరియా చట్టంలో మహిళల, బాలికల హక్కులను, భావప్రకటన స్వేచ్ఛకు తాలిబన్‌ వర్గాలు గౌరవిస్తాయని అన్నారు. ఏ సమస్యలను పరిష్కరించడానికైనా అన్ని దేశాలు, సంస్థలు తమతో చర్చలు జరపాలని కోరుతున్నామని అన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌ ప్రధాని అష్రఫ్‌ ఘనీ దేశాన్ని విడిచి పారిపోతారని ఊహించలేదని, అతని సన్నిహితులు కూడా ఊహించలేదని చెప్పారు. దేశంలోని పౌరులు, వర్గాలు, సంస్థలతో చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని, వారికి అవసరమైన రక్షణ కల్పిస్తామని హావిూ ఇస్తామని అన్నారు. 20 ఏళ్ల యత్నాల, త్యాగాల ఫలితాలను తాలిబన్‌లు చూస్తున్నారని అన్నారు. తాము అనుకున్న లక్ష్యాన్ని సాధించామని, ఇది తమ దేశ, ప్రజల స్వాతంత్యమ్రని చెప్పారు. తమ దేశంలోకి ఎవరినీ అనుమతించమని, అలాగే తాము ఇతర దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోమని స్పష్టంచేశారు. తాలిబన్‌లు ఏ దౌత్య సంస్థ కార్యాలయాలను, దేశ ప్రధాన కార్యాలయాలను లక్ష్యంగా చేసుకోలేదని, పౌరులకు, దౌత్య కార్యకలాపాలకు భద్రత కల్పిస్తుందని నయిమ్‌ అన్నారు.