అభిమానులే నా ఆస్తులు : సచిన్
ఘనంగా జన్మదిన వేడుకలు
కోల్కొత, ఏప్రిల్ 24 (జనంసాక్షి) :
అభిమానులే తన ఆస్తులని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ రమేశ్ టెండుల్కర్ అన్నారు. బుధవారం ముంబైలో తన 40వ జన్మదినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. భార్య అంజలితో కలిసి బర్త్డే కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రెండు దశాబ్దాల తన సుదీర్ఘ ప్రస్తానంలో అభిమానులు ప్రతి సందర్భంలోనూ అండగా నిలిచారని అన్నారు. వారు ఇచ్చిన తోడ్పాటు ఎప్పటికీ మరువలేనని పేర్కొన్నారు. వారు వెన్నంటి ఉండి ప్రోత్సహించడం వల్లే తాను ఇన్ని రికార్డులు సాధించగలిగానని చెప్పారు. క్రికెట్ రికార్డుల కోసం ఆడలేదని, జట్టు కోసం దేశం కోసం ఆడుతున్న క్రమంలోనే రికార్డులను నమోదు చేశానన్నారు. కుటుంబం, అభిమానులు, సన్నిహితుల సహకారంతోనే తాని స్థాయిలో ఉన్నానని చెప్పారు. తనలో క్రికెట్ ఆడే శక్తి ఉన్నంతకాలం ఆడుతానని చెప్పారు.