అభివృద్దిని చూపే ఓట్లు అడుగుతున్నాం: ముత్తిరెడ్డి

జనగామ,సెప్టెంబర్‌29(జ‌నంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే శ్రీరామరక్షగా నిలుస్తాయని జనగామ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు.  ప్రభుత్వం అమలు చేసిన పథకాలను క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకెళ్లి ఓట్లు అడుగుతున్నామని అన్నారు. అలాగే తమ పార్టీ వారు కూడా  నియోజకవర్గ అభవృద్దిని ప్రజలకు వివరించిన ఓట్లు అడగాలని కార్యకర్తలకు సూచించారు.  సీఎం కేసీఆర్‌, డిప్యూటి సిఎం కడియం, ఇతర నాయకుల సహకారంతో నియోజకవర్గ అభివృద్ధికి శక్తివంచన లేకుండా పనిచేశామని అన్నారు.  మారుమూల గ్రామాలకు సైతం రోడ్డు నిర్మాణాలతో పాటు, అంతర్గత రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించానని అన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, భవిష్యత్‌లో నియోజకవర్గాన్ని మోడల్‌గా తీర్చిదిద్దేందుకు అవకాశం ఇవ్వాల్సిందిగా ఆయన ఓటర్లను అభ్యర్థించారు.