అభివృద్దిలో మనమే ముందున్నాం: మంత్రి

వికారబాద్‌,మే30(జ‌నం సాక్షి): అభివృద్ధి, సంక్షేమంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని మించిన ప్రభుత్వం దేశంలోనే లేదన్నారు మంత్రి మహేందర్‌రెడ్డి. రైతాంగం, మహిళా సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ అనేక పథకాలను ప్రవేశపెడుతున్నారని ఆయన తెలిపారు. వికారాబాద్‌ జిల్లా పరిగి నియోజకవర్గంలోని కుల్కచర్ల మండలంలో మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా రూ. 2.51 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. రూ. 25 లక్షలతో మార్కెటింగ్‌ శాఖ కవర్‌షెడ్‌ పనులు, ఇప్పాయిపల్లిలో రూ. 50.40 లక్షలతో డబుల్‌ బెడ్రూం ఇండ్లు, రూ. 13 లక్షలతో జీపీ భవనం పనులను మంత్రి మహేందర్‌రెడ్డి ప్రారంభించారు.