అమరవీరుల త్యాగ ఫలం వృధా కానీయొద్దు

ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి
ఫొటో ఉంది
హత్నూర (జనం సాక్షి)
శతాబ్దాల కాలం పాటు ఆంగ్లేయుల చెరలో బందీయైన భారతావని స్వేచ్ఛా వాయువులు పీల్చుకునేందుకు అలుపెరుగని పోరాటం చేసి ప్రాణాలు అర్పించిన అమరవీరుల త్యాగ ఫలం వృధా కానీయొద్దని స్థానిక ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డి అన్నారు.స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం దౌల్తాబాద్ గ్రామ ముస్లీంల ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ తిరంగా ర్యాలీలో ఎమ్మెల్యే పాల్గొన్నారు.స్థానిక జుమా మసీదు నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ సందర్భంగా మహాత్మా గాంధీ, రాజీవ్ గాందీ,అంబేద్కర్,తెలంగాణా తల్లి విగ్రహాలకు పూల మాలలు వేసి పలు నినాదాలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కుల,మత,జాతి,వర్గ విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ స్వతంత్ర భారత వజ్రోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు.ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజల మధ్య ఐకమత్యం పెంపొందుతుందని వారు పేర్కొన్నారు.కార్యక్రమంలో లేబర్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ దేవేందర్ రెడ్డి,తెలంగాణా పీసీసీ రాష్ట్ర కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి,మైనారిటీ విభాగం రాష్ట్ర కార్యదర్శి ఎమ్ ఏ‌ హకీం,మెదక్ జిల్లా కో ఆప్షన్ సభ్యులు మన్సూర్ అలీ,ఎంపీపీ వావిలాల నర్సింలు,దౌల్తాబాద్ గ్రామ సర్పంచి జిల్లా నాయకుడు కొన్యాల వెంకటేశం,  టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి,రైతు సమన్వయ కమిటీ మండల కోఆర్డినేటర్ బుచ్చిరెడ్డి, నర్సాపూర్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రియాజ్ అలీ,ఆశం అలీ,దస్తగిరి,జావేద్ షాకీర్ హుస్సేన్, సర్వర్ ఖాన్,అజీజ్,అజ్మత్,ఖాజామియా,బాబా తదితరులు పాల్గొన్నారు.