అమ్మవారి ఆలయంలో చోరీ

రంగారెడ్డి : అమ్మవారి ఆలయంలో శనివారం అర్ధరాత్రి చోరీ జరిగింది. జిల్లాలోని ఇబ్రహీంపట్నం మండలం శేరిగూడలోగల ఓ దేవాలయంలో అర్థరాత్రి దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఈ సందర్బంగా హుండీని ఎత్తుకెళ్లారు. అలాగే అమ్మవారి విగ్రహాన్ని ఊరిబయట పడేశారు. ఆదివారం ఉదయం విషయం తెలుసుకున్న పోలీసులతోపాటు స్థానికులు చోరీ జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. అలాగే చోరీకి పాల్పడిన వారి కోసం గాలిస్తున్నారు.