‘అమ్మహస్తంలో’ తోపులాట .

రంగారెడ్డి జిల్లాలోని షాబాద్‌లో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేపట్టిన ‘అమ్మహస్తం’కార్యక్రమంలో బుధవారం స్వల్ప తోపులాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో పలువురికి గాయాలు కాగా ,ఓ మహిళ పరిస్ధితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. చికిత్స నిమిత్తం ఆమెను సమీప ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం