అరుణ ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయునికి ఘన సన్మానం

గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 7 (జనం సాక్షి);
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో గట్టు మండలం లోని తారాపురం గ్రామం లో పనిచేస్తున్నకులదీప్ నయ్య ర్ (ఎస్ జి టి ) ఉపాధ్యాయునికి అరుణ ఆర్ట్స్ ఫౌండర్ కె, ఏ.రాజు ఆధ్వర్యంలో శాలువా పూలమాలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉపాధ్యాయుడు జిల్లా యువనేత కె ఎం ఎస్ శ్రావణ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అరుణ ఆర్ట్స్ పౌండర్ కె.ఎ.రాజు మాట్లాడుతూ సహోదరుడు కులదీప్ నయ్యర్ కు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎన్నికైనందుకు చాలా సంతోషంగా ఉందని సంతోషించదగ్గ విషయం అని అందుకు గర్విస్తూ మునుముందు ఇలాంటి అవార్డులు ఎన్నో పొందాలని ఉపాధ్యాయ వృత్తికి మరింత వన్నె తేవాలని ఆకాంక్షిస్తూ అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఉద్యోగి ఎం ఎస్ శాంతి రాజు ,కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు నందు, ఎమ్మార్పీఎస్ నాయకులు మన్యం,ఎల్లప్ప తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.