అవార్డు పొందిన ఎస్ఐకి పిఎసిఎస్ చైర్మన్ సన్మానం.

నెరడిగొండఆగస్టు19(జనంసాక్షి): మండలంలో పోలీసు శాఖలో ఎస్ఐ హోదాల్లో విధులు నిర్వహిస్తున్న  మహేందర్ కు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ చేతుల మీదుగా బెస్ట్ అవార్డు గ్రహీత ఎస్ఐ మహేందర్ ప్రశంస పత్రాలు అందుకున్నారు.ఉత్తమ సేవలు అందించి ప్రశంస పత్రాలు పొందినందుకు ఎస్ఐ మహేందర్ కు శుక్రవారం రోజున కుమారి గ్రామ పీఏసీఎస్ చైర్మన్ మందుల రమేష్  గ్రామస్తులతో కలిసి శాలువాతోసత్కరించారు.మండల ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి మరింత సేవలందించాలనిమందుల రమేష్ కోరారు.ప్రభుత్వం గుర్తించి ప్రశంస పత్రాలు అందించడం పట్ల మండల వాసులు సంతృప్తి వ్యక్తం చేశారు.