అశ్వరావుపేట నియోజకవర్గానికి 17.83కోట్లు మంజూరు చేయించిన మెచ్చ..

అశ్వారావుపేట, నవంబర్ 15(
జనం సాక్షి)
అశ్వరావుపేట నియోజకవర్గం అభివృద్ధి కి స్థానిక ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరరావు నియోజకవర్గంలోని అశ్వరావుపేట దమ్మపేట ములకలపల్లి అన్నపురెడ్డిపల్లి చంద్రుగొండ మండలాల అభివృద్ధి పనులకు రు.17.83 కోట్ల రూపాయలు మంజూరు చేయించారు. మంగళవారం హైదరాబాదులో జరుగుతున్న ముఖ్యమంత్రి భేటీకి హాజరైన ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు నియోజకవర్గంలోని జరగవలసినటువంటి అభివృద్ధి పై ముఖ్యమంత్రి తో పాటుమంత్రులతో చర్చించి అశ్వరావుపేట నియోజకవర్గా అభివృద్ధి కోసం ఇంత పెద్ద మొత్తంలో నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి తో పాటు మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అశ్వరావుపేట మండలంలోని కొండతోగు గ్రామానికి రోడ్డు నిర్మాణం కొరకు 98 లక్షలు జడ్పీ రోడ్డు నుండి గంగారం రోడ్డు వరకు రు.70 లక్షలు నారవారిగూడెం నుండి గుర్రాల చెరువు గ్రామానికి రోడ్డు మార్గం కొరకు రు.1. 78 కోట్లు రెడ్డిగూడెం గ్రామం నుండి సుద్ద గోతులగూడెం గ్రామానికి రోడ్డు నిర్మాణానికి రు.43 లక్షలు అదేవిధంగా దమ్మపేట మండలం లింగాలపల్లి నుండి గ్రామానికి రోడ్డు మార్గం కొరకు రు.1.95 కోట్లు చలమప్ప గూడెం నుండి సుందరయ్య నగర్ రోడ్డు మార్గం కొరకు రు.1.06కోట్లు రాజుపేట నుండి పాత గుండాలపాడు గ్రామానికి రోడ్డు మార్గం కొరకు రు.1.65కోట్లు జగన్నాధపురం నుండి ఎర్రగుంట గ్రామానికి రోడ్డు మార్గం కొరకు రు.46 లక్షలు అన్నపురెడ్డిపల్లి మండలం రంగాపురం నుంచి గుంపెన గ్రామానికి రోడ్డు నిర్మాణం కొరకు రు. 1.37కోట్లు చండ్రుగొండ మండలం అయ్యన్నపాలెం నుంచి బలికుంట రోడ్డు మార్గం కొరకు రు.1.60కోట్లు రూపాయలు మంజూరు చేయించినట్లు ఆయన తెలిపారు

తాజావార్తలు