అసమర్థ, అవినీతి పార్టీలు రాష్ట్రాన్ని పాలిస్తున్నాయి : హోంమత్రికి తెదేపా లేఖ

న్యూఢిల్లీ : గత 8 ఏళ్లుగా అసమర్థ, అవినీతితో కూడిన పార్టీలు రాష్ట్రాన్ని పాలిస్తున్నయని అఖిలపక్ష భేటీలో హోంమత్రికి ఇచ్చిన లేఖలో తెదేపా పేర్కొంది. అన్ని రంగాల్లోనూ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందని లేఖలో పేర్కొన్నట్లు పార్టీ నేతలు తెలియజేశారు. రాష్ట్రంలో సమస్యలన్నీ ప్రస్తావిస్తూ తెలంగాణపై త్వరగా నిర్ణయం ప్రకటించాలని లేఖలో కోరినట్లు వెల్లడించారు.