ఆగివున్న లారీని ఢీకొన్న ట్రావెల్‌ బస్సు

నార్కట్‌పల్లి: నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఆగివున్న లారీని ఓ ప్రైవేట్‌ ట్రావెల్‌ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో నలుగురు గాయపడ్డారు. ఈ ఘటనతో హైదరాబాద్‌-విజయవాడ ప్రధాన రహదారిపై రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.