ఆత్మ లింగేశ్వర ఆలయానికి ప్రత్యేక పూజలు

నాగిరెడ్డిపేట్ :10 అక్టోబర్ జనం సాక్షి నాగిరెడ్డి పెట్ మండలంలోని ఆత్మకూరు గ్రామంలో నూతనంగా నిర్మించనున్న ఆత్మ లింగేశ్వర శివాలయ నిర్మాణానికి సోమవారం జెడ్పిటిసి ఉమ్మన్న గారి మనోహర్ రెడ్డి, స్థానిక సర్పంచ్ బాల్ రెడ్డి తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పిటిసి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో సుమారు 80 లక్షల రూపాయల వ్యయంతో పూర్తి రాతితో ఈ ఆలయ నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు నారాయణ రెడ్డి, సుబాన్ రెడ్డి, వసంత్ రెడ్డి, వెంకట్ రెడ్డి, బాలాగౌడ్, రవీందర్ రెడ్డి, నారాయణ, రాము, గ్రామస్తులు ఉన్నారు.

 

నాగిరెడ్డి పెట్ తహశీల్దారు కార్యాలయం దిగ్బంధం చేసిన వి అర్ ఏలు

నాగిరెడ్డిపేట్ 10 అక్టోబర్ జనం సాక్షి: గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ సోమవారం మండల విఆర్ఎ లు తహశీల్దారు కార్యాలయాన్ని దిగ్బంధం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తహశీల్దార్ కార్యాలయాన్ని విఆర్ఎ లు దిగ్బంధనం చేయడంతో తహశీల్దారు సయీద్ అహ్మద్ మస్రూర్, ఇతర సిబ్బంది కొద్ది సమయం పాటు కార్యాలయం బయటనే వేచి ఉన్నారు. ఈ సందర్భంగా విఆర్ఎ లు మాట్లాడుతూ విఆర్ఎ ల సమస్యల పరిష్కారం కోసం 78 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఏ మాత్రం స్పందించక పోవడం సిగ్గు చేటన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి విఆర్ఎ ల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రధాన కార్యదర్శి అంతి పోచయ్య, మండల అధ్యక్షుడు నిరుడి రాజయ్య, ఉపాధ్యాక్షుడు మాదాసు దుర్గయ్య, సెక్రటరీ పిట్ల సంపత్ కుమార్, కోశాధికారి నాయికోటి రాజు, గౌరవ అధ్యక్షుడు శ్రవణ్ కుమార్, సాయిలు, దుర్గయ్య, వివిధ గ్రామాల విఆర్ఏ లు పాల్గొన్నారు.