ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత- జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్.

 

 

 

 

జనం సాక్షి ఉట్నూర్ :ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని జెడ్పీ చైర్మన్  జనార్ధన్ రాథోడ్ అన్నారు. ఈరోజు ఇంద్రవెల్లి మండల కేంద్రానికి చేరిన మాతంగ్ ఋషి సద్గురు గజానంద్ మావులీ జన్మదిన వేడుకల పాదయాత్రకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మహారాజ్ లు చేసిన ప్రవచనాలు ఆలకించారు. అనంతరం మహారాజ్ లను శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా జెడ్పి చైర్మన్ మాట్లాడుతూ… దైవభక్తితోనే మనసుకు ప్రశాంతత లభిస్తుందన్నారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ, ప్రతి ఒక్కరూ భక్తి మార్గంను ఎంచుకోవాలని పేర్కొన్నారు. దైవభక్తితో పాటు దృఢ సంకల్పం తోడైతే అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చని తెలిపారు.  చలి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని 28 మంది భక్తులకు దుప్పట్లను పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కనక తుకారం,దత్త మహారాజ్, సంగ్రామ్ మహారాజ్, మారుతి మహారాజ్, లింగంపల్లి గంగన్న, అరికిల్ల అశోక్, బాబు ముండే,దావుల రమేష్, జాదవ్ రవి,భక్తులు అధిక సంఖ్యలో  పాల్గొన్నారు.

తాజావార్తలు