ఆయిల్ బాల్స్ తో దోమల నిర్మూలన

నల్లబెల్లి జులై 22 (జనం సాక్షి):
ఆయిల్ బాల్స్ తో దోమలను నిర్మూలించవచ్చునని మండల పంచాయతీ అధికారి కూచన ప్రకాష్ పేర్కొన్నారు. మండలంలోని నాగరాజు పల్లె గ్రామంలో ఆయిల్ బాల్స్ వేయు పనులను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపివో మాట్లాడుతూ నీరు నిల్వ ఉన్న ప్రదేశాలల్లో ఆయిల్ బాల్స్ వేసి దోమలు వ్యాప్తి చెందకుండా నిర్మూలించాలని తెలిపారు. అన్ని గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు ఈ కార్యక్రమాన్ని చేపట్టి సీజన్ వ్యాధులు రాకుండా అరికట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గోనె శ్రీదేవి, పంచాయతీ కార్యదర్శి సంతోష్, మల్టీ పర్పస్ వర్కర్లు పాల్గొన్నారు.