ఆరుట్ల గ్రామంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన వివిధ పార్టీల యువకులు

ఇబ్రహీంపట్నం, నవంబర్14(జనంసాక్షి):-
మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో వివిధ పార్టీలకుచెందిన యువకులు కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొంగర విష్ణు వర్ధన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా కొంగర విష్ణు వర్ధన్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ లోచేరిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ అండగా ఉంటానని అన్నారు తెలంగాణ రాష్ట్రంలో బి అర్ యస్ ప్రభుత్వం పేద ప్రజలకు పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేయక పోవటంతో బి అర్ యస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ పై తెలంగాణ రాష్ట్ర ప్రజల నుండి వ్యతిరేకత మొదలై కాంగ్రెస్ పార్టీని గెలిపించటనికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు సిద్దంగా ఉన్నారు అన్నారు రాబోయే ఎన్నికల్లో ఇబ్రహీంట్నం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి మల్ రెడ్డి రంగారెడ్డి గెలుపు కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి మల్ రెడ్డి రంగారెడ్డి బారి మెజార్టీ తో గెలిపించాలి అన్నారు పార్టీలో చేరిన వారు వెంకటేష్, రాజు,పోలమొని సత్తయ్య,పోలమోని నర్సిహ,పోళమొని విజ్జీలి,నూకం జంగయ్య,నూకం రాజు, చింథం పాండు,జోగిని శేఖర్,జోగిని మల్లేష్ పాండు హరి
రమేష్ ఈ కార్యక్రమంలో నాయకులు
వేదిరే రమణ రెడ్డి, చెంద్రయ్య ,మాదగోని జంగయ్య గౌడ్,
వేదిరే లక్ష్మ రెడ్డి, అంతటి రాజు గౌడ్ , మర సురేష్
సాతిరి ఎల్లేష్,పొలమోనీ అనిల్ రాజ్ ఎన్నుదుల సురేష్,
చింధం ఐలయ్య ,తవిటి యాదగిరి,అంతటి కృష్ణ గౌడ్, తదితరులు పాల్గొన్నారు