ఆలయ ప్రారంభానికి రావాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఆహ్వానం

రంగారెడ్డి/ఇబ్రహీంపట్నం, జూన్ 18(జనంసాక్షి):-యాచారం మండల పరిధిలోని నందివనపర్తి గ్రామం లో నూతనంగా ముదిరాజుల ఆరాధ్యదైవం పెద్దమ్మతల్లి దేవాలయం ప్రారంభానికి బి ఎన్ రెడ్డి ట్రస్ట్ చైర్మన్ బిలకంటి శేఖర్ రెడ్డి  అధ్వర్యంలో  శనివారం నాడు  తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ని తమ నివాసంలో కలిసి ఆహ్వాన పత్రాన్ని అందజేసి ఆహ్వానించారు ఈ సందర్భంగా మంత్రి సానుకూలంగా స్పందించి తప్పకుండా వస్తానని చెప్పారు
ఈ కార్యక్రమంలో సామ రాములు సంఘం గణేష్ సామ బాలకృష్ణ యాదగిరి బాలరాజు వెంకటేష్ నుకం మహేందర్ గునమోని గణేష్ తదితరులు పాల్గొన్నారు