ఆషాడ ఆఖరి రోజు సందర్భంగా శ్రీ ఏకాంభారీశ్వరి మహమ్మాయి దేవికి హారతి

జనగామ రూరల్ (జనంసాక్షి)జూలై23: జనగామ జిల్లాలోని పెంబర్తి గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ ఏకాంబరేశ్వర మహమ్మాయి దేవియే నమః అంటూ భక్తులు కొలిచారు. శాకాంబరీ దేవి అవతారంలో అమ్మవారి దేవాలయం నయనానందకంగా ఉందని బక్తులు కొనియాడారు. ఈ సందర్భంగా పెంబర్తి లోని విశ్వకర్మ లు అందరూ పాల్గొని తీర్థప్రసాదాలు తీసుకున్నామని మాపై కృపాకటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నామని విశ్వ బ్రాహ్మణుల సంఘం మండల ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్ తెలిపారు. ఈ అలంకరణ సేవలో పాల్గొన్న భక్తులందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని పూజారి శనగల నాగేష్ శర్మ ఆశీస్సులు అందచేశారు