ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేస్తాం.

ఎంపీపీ పంద్ర జై వంత్ రావు.
జనం సాక్షి ఉట్నూర్.
ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలనే ఉద్దేశంతోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని  ఉట్నూర్ ఎంపిపి పంద్ర జై వంత్ రావు తెలిపారు.ఈ సందర్భంగా ఉట్నూర్ మండల కేంద్రంలో మంగళవారం నాడు షంపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రని సందర్శించి ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించడం జరిగిందని ఇట్టి సమావేశంలో ఆసుపత్రి అభివృద్ధి పని వివరాలు గత 23 సంవత్సరాల నుండి జరిగిన అభివృద్ధి గురించి తెలుసుకున్నరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రక్తపు పరీక్షాకు కావలసిన సామాగ్రిలలో మూత్ర పరీక్ష నిమిత్తం కావాల్సిన కిట్లు ఆక్సిజన్ తాగునీరు సౌకర్యం ఆసుపత్రికి తగిన సౌకర్యాలు పరిశుభ్రత కేసిఆర్ కిట్లు అందించుట అత్యవసర మందులు కొనుగోలు చేయడం మొదలగున అంశాలను చర్చించడం అభివృద్ధి కమిటీ సభ్యులు అందరూ ఏకాద్రీవంగా తీర్మానించడం జరగిందని ఎంపీపీ తెలిపారు. ఈ సమావేశంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ విజయకుమార్ ఆసుపత్రి వైద్యులు సర్పంచులు ఎంపిటిసి తదితరులు ఉన్నారు.