ఆస్తిపన్ను చెల్లింపు దారులతో కిటకిటలాడిన మున్సిపల్‌ కార్యాలయం

కుత్బుల్లాపూర్‌: ఆస్తిపన్ను చెల్లింపు దారులతో శనివారం మున్సిపల్‌ కార్యాలయం కిటకిటలాడింది. అపరాధ రుసుము, వడ్డీలేకుండా ఆస్తిపన్ను చెల్లించడానికి మార్చి 31 గడువు తేది కావడంతో చెల్లింపు దారులు భారీగా కార్యాలయానికి చేరుకున్నారు. చెల్లింపుదారుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అదనంగా 7 కౌంటర్లను ఏర్పాటు చేశారు. చెల్లింపుదారుల సౌకర్యార్థం ఆదివారం బిల్లు కౌంటర్లు తెరిచి ఉంచుతున్నట్లు సర్కిల్‌ ఉపకమిషనర్‌ సామ్రాట్‌ అశోక్‌ తెలిపారు. ఆదివారం ఉదయం 8గం. నుంచి రాత్రి 10గం. వరకు బిల్లులు చెల్లించుకోవచ్చని ఆయన తెలిపారు.