ఇంగ్లాండ్‌లో కాల్పుల కలకలం

ఇద్దరు మహిళలు సహా ఆరుగురు మృతి
లండన్‌,ఆగస్ట్‌13(జనంసాక్షి): నైరుతి ఇంగ్లాండ్‌లోని ప్లైమౌత్‌ నగరంలో శుక్రవారం ఉదయం కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోయినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. కాల్పులకు తెగబడిన దుండగులకు ఉగ్రవాదులతో ఎలాంటి సంబంధాలు లేవని ప్రాథమికంగా ధ్రువీకరించామన్నారు. మృతుల్లో కాల్పుల జరిపిన ఓ వ్యక్తి కూడా ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మరికొంత మందికి గాయాలైనట్లు డెవాన్‌, కార్న్‌వాల్‌ పోలీసులు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. వారిని ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. కీహామ్‌?జిల్లాలో జరిగిన ఈ ఘటనపై మరిన్ని వివరాలు అందించడానికి పోలీసులు నిరాకరించారు. ఎయిర్‌? అంబులెన్స్‌?, పారా మెడికల్‌? సిబ్బంది త్వరితగతిన స్పందించారు. చనిపోయిన వారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు.