ఇంటర్ ప్రదమంలో మెరిసిన చామకూరి వైష్ణవి.

చామకూరి వైష్ణవి ఇంటర్ ప్రథమ సంవత్సర ఫలితాలలో అత్యుత్తమ ప్రతిభ సాధించింది. పట్టణానికి చెందిన చామకూరి వీరయ్య గౌడ్
సరస్వతిల పుత్రిక హైదరాబాద్ శ్రీ చైతన్య కళాశాలలో చదువుతుంది.రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షా ఫలితాలలో 460/470 మార్కులు సాధించి సత్తా చాటింది.వైష్ణవి ఎనిమిదవ తరగతి వరకు నేరేడు చర్ల శ్రీవాణి స్కూల్,పదవ తరగతి కోదాడ శ్రీ చైతన్య స్కూల్ లో విద్యను అభ్యసించింది.అత్యుత్తమ ఫలితాలు సాధించిన వైష్ణవి నీ తల్లిదండ్రులతోపాటు గురువులు,బంధుమిత్రులు అభినందించారు