ఇంటి నిర్మాణ పనుల్లో అపశృతి

కరెంట్‌ వైర్లు తగిలి మగ్గురు మృతి
చిత్తూరు,అగస్టు9(జనంసాక్షి): చిత్తూరు జిల్లా పాల సముద్రం మండలం కన్యకాపురంలో పెనువిషాదం చోటు చేసుకుంది. ఇంటి నిర్మాణం కోసం కంకర టిప్పర్‌ లోడ్‌ ను అన్లోడ్‌ చేస్తుండగా విద్యుత్‌ వైర్లు తగిలి ముగ్గురు మృతి చెందారు. ఈ ఘటనలో టిప్పర్‌ డ్రైవర్‌ మనోజ్‌ కుమార్‌ ముందుగా విద్యుత్‌ షాక్‌కు గురయ్యాడు. అతని రక్షించడానికి వెళ్లిన దొరబాబు, జ్యోతిష్కులు కూడా అక్కడికక్కడే మృత్యవాత పడ్డారు. ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు చనిపోవడంతో స్థానికంగా తీవ్ర విషాదం ఛాయలు నెలకొన్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడుతున్నారు.