ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.

సర్పంచ్ కర్రే మంజుల అశోక రెడ్డి.
 చిట్యాల 8(జనం సాక్షి) ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సర్పంచ్ కర్రే మంజుల అశోక్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని  చల్లగరిగ గ్రామంలో సర్పంచ్ కర్రె మంజులఅశోక్ రెడ్డి, ఉప సర్పంచ్ సంగ గౌతమి అశోక్  ఆద్వర్యంలో డ్రై డే, ప్రై డే కార్యక్రమం నిర్వహించారు.గ్రామంలో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని, ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా వుంచుకోవాలని, కాచి చల్లార్చిన నీటిని త్రాగాలని, ప్రతి ఇంటికి తిరిగి ప్రజలందరికీ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ,ఏ ఎన్ ఎమ్, అంగన్ వాడి టీచర్స్, ఆశా వర్కర్స్, సీ ఏ లు, పాల్గొన్నారు.