ఇటుక బట్టీలో పని చేస్తున్న మహిళపై సామూహిక అత్యాచారం

రంగారెడ్డి: ఒడిశాకు చెందిన మహిళ మహేశ్వరంలో దినసరి కూలీగా పని చేస్తూ జీవనం కొనసాగిస్తోంది. మహేశ్వరం మండలం ఎన్.డి తాండ పక్కన ఇటుక బట్టీలో పని చేస్తున్న మహిళపై గత రాత్రి నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆ నలుగురు అక్కడి నుంచి పరారయ్యారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు మహేశ్వరం పోలీసులు నిందితుల కొసం గాలింపు చర్యలు చేపట్టారు.