ఇద్దరు గంజాయి స్మగ్లర్లపై పీడీయాక్ట్..

వరంగల్ ఈస్ట్ , జూలై 15(జనం సాక్షి):
వరంగల్ నగరంలోని మట్వాడాపోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడిన మహిళతో పాటు ఒక నిందితుడిపై పీడీ యాక్ట్ ఉత్తర్వులను  శుక్రవారం వరంగల్ పోలీస్ కమిషనర్ డా.తరుణ్ జోషి జారీ చేశారువరంగల్ పోలీస్ కమిషనరేట్ లోని మట్వాడా గంజాయి స్మగ్లింగ్ పాల్పడుతు పోలీసులకు చిక్కిన బిహర్ రాష్ట్రానికి చెందిన రాజ్ కుమార్, ఒడిషా రాష్ట్రానికి చెందిన మహిళా నిందితురాలు దమ్ముని నాయక పై వరంగల్ పోలీస్ కమిషనర్ జారీ చేసిన పీడీ యాక్ట్ ఉత్తర్వులను మట్వాడా ఇన్ స్పెక్టర్ చిలువేరు రమేష్ నిందితులు రాజేష్ కుమార్‌కు చర్లపల్లి కారాగారం అందజేయగా, మరో నిందితురాలు దమ్ముని నాయక్ కు చంచల్ గూడ కారాగారంలో అందజేసారు.
పీడీ యాక్ట్ అందుకున్న నిందితులు ఇద్దరు వరంగల్ పోలీస్ కమిషనరేట్ లోని మట్వాడా పోలీస్ స్టేషన్ పరిధిలో గత ఏప్రిల్ మాసంలో గంజాయి విక్రయిస్తుండగా మట్వాడా పోలీసులు అరెస్ట్ చేసి జైలు కు తరలించారు.
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడూతూ చట్టవ్యతిరేక కార్య కలపాలకు పాల్పడే వ్యకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు వారిపై పీడీయాక్ట్ క్రింద కేసులు నమోదు చేయబడుతాయని వరంగలసి పోలీస్ కమిషనర్ హెచ్చరించారు.
Attachments area