ఇన్చార్జి సర్పంచిగా నరేష్ కుమార్ బాధ్యతల స్వీకరణ…

కామారెడ్డి సెప్టెంబర్1(జనంసాక్షి);
కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం సంగమేశ్వర్ గ్రామ పంచాయితీ ఇన్చార్జి సర్పంచ్ గా ఉప సర్పంచ్ జెట్టబోయిన నరేష్ కుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. సర్పంచి సుమలతకి ఏఎన్ఎం గా ఉద్యోగం రావడంతో ఆమె రాజీనామా చేశారు . ఈ మేరకు అధికారులు ఆమె రాజీనామాను
ఆమోదం తెలపడంతో ఉప సర్పంచ్ కి ఇన్చార్జి బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు..  ఉత్తర్వుల మేరకు ఉపసర్పంచ్ నరేష్ కుమార్ గ్రామపంచాయతీ సభ్యుల ప్రత్యేక సమావేశంలో ఇన్చార్జి సర్పంచ్ గా పదవి బాధ్యతలు చేపట్టారు.. ఆయన్ని జెడ్పిటిసి సభ్యుడు తీగల తిరుమల్ గౌడ్, ఎంపీపీ కానుగంటి శారద నాగరాజు, వైస్ ఎంపీపీ పుట్ట బాపురెడ్డి పంచాయతీ సభ్యులు శాలువాలతో సన్మానించి అభినందించారు. ఇంతకాలం సర్పంచిగా పనిచేసే సేవలందించిన కరికె సుమలత మురళిలను పంచాయతీ సభ్యులు సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీడీవో చిన్నారెడ్డి , ఎంపీ ఓ తిరుపతిరెడ్డి,  మాజీ ఎంపీటీసీ సభ్యుడు నల్లపు శ్రీనివాస్, గ్రామ కార్యదర్శి రాహుల్ గౌడ్ , కారోబార్ నర్సింలు , వార్డు సభ్యులు గౌతమి,  సంతోషి, రామ్ రెడ్డి, శ్యామల ,లక్ష్మి, రంజిత్ కుమార్, లాస్య, శ్వేత, పోషవ్వ, శ్యామ్ ,రాజు, స్థానిక టిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.