*ఇన్చార్జి సర్పంచ్ పూర్ణ చందర్ పై సస్పెన్షన్ వేటు.

చిట్యాల29(జనంసాక్షి)రైతు వేదిక నిధులను దుర్వినియోగం చేసిన అభియోగం లో తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 లోని సెక్షన్ 37( 5) ప్రకారంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల గ్రామ పంచాయతీ ఇంచార్జి సర్పంచ్‌ ఇరుకులపాటి పూర్ణచందర్ రావు ను ఆరు నెలలపాటు సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ భవేశ్ మిశ్రా బుధవారం ఉత్తర్వులు జారీ చేసినట్టు ఎంపీడీవో రామయ్య పేర్కొన్నారు. గత కొన్ని నెలల క్రితం ఇంచార్జి సర్పంచ్‌ రైతు వేదిక సంబంధించిన నిధులను దుర్వినియోగం చేశారని సంబంధిత కాంట్రాక్టర్ కట్కూరి నరేందర్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అనంతరం జీపీలో జరిగిన విచారణలో సర్పంచ్ అవినీతికి పాల్పడినట్లు నిరూపితం కాగా ఆరు నెలల పాటు ఆయనను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారన్నారు.