ఇల్లందులో హోరెత్తిన బిజెపి ప్రచార జోరు

ఇల్లందు నవంబర్ 15 (జనం సాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో భారత జనతా పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో గడపగడపకు ప్రచారాన్ని నిర్వహిస్తూ కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ ఇల్లందులో బిజెపి పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రచారాన్ని హోరెత్తించారు. ఈ బుధవారం నాడు భారత జత పార్టీ గెలుపును ఆకాంక్షిస్తూ రాష్ట్ర గిరిజన మోర్చా కార్యవర్గ సభ్యులు బొడ సురేందర్ నాయక్ మహిళా మోర్చా నాయకురాలు సుచిత్ర పాసి ఆధ్వర్యంలో ఆమ్ బజార్ మెయిన్ రోడ్డు ఎల్బిఎస్ నగర్ నందు 19వ వార్డులో విస్తృత ప్రచారాన్ని నిర్వర్తించారు. ఈ కార్యక్రమంలో రామచంద్రనాయక్ సంజీవరెడ్డి నాగరాజు మిర్యాల మహేష్ మాధవ్ సందీప్ పండు శివ కుమార్ సుమలత శకుంతల స్రవంతి పద్మ లీల దుర్గ బాయ్ శిరీష సుశీల రాజు కృష్ణ కాలింది పటేల్ తదితరులు పాల్గొన్నారు.