ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

ధర్మపురి,కరీంనగర్‌:గోదావరి నది తీరం నుంచి రెండు ట్రాక్టర్లలో అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా ధర్మపురి రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు.ఎలాంటి అనుమతులు లేకుండా తరలిస్తున్నందకు యజమానులపై కేసులు నమోదు చేసి ట్రాక్టర్లును పొలీసుస్టేషన్‌కు తరలించినట్లు ధర్మపురి డిప్యూటీ తహపీల్దార్‌ ప్రభాకర్‌రావు తెలిపారు.