ఈటలకు కేసముద్రం మెపా పరామర్శ

కేసముద్రం సెప్టెంబర్ 1 జనం సాక్షి /మాజీ మంత్రి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తండ్రి ఈటల మల్లయ్య ముదిరాజ్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా మెపా (ముదిరాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ తెలంగాణ) కేసముద్రం మండల కమిటీ ఆధ్వర్యంలో గురువారం నాడు పరామర్శించారు. ఈ సందర్బంగా మల్లయ్య చిత్రపటం వద్ద నివాళులర్పించి,ఈటల కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్బంగా మెపా మండల అధ్యక్షులు జెనిగల అనిల్ కుమార్ ముదిరాజ్ మాట్లాడుతూ మల్లయ్య మరణం బాధాకరం అని,జిల్లా వ్యాప్తంగా ఉన్న ముదిరాజ్ బందువులు ఐక్యంగా ఉండి తమ గళాన్ని వినిపించాలని అన్నారు..ఈ కార్యక్రమంలో మెపా మండల ప్రధాన కార్యదర్శి గుండ్రపల్లి దేవేందర్ లతో పాటు ముదిరాజ్ పెద్దలు నీలం దుర్గేష్ , ఎదర బోయిన సూరయ్య, లింగాల పిచ్చయ్య, శీలం శ్రవణ్ ,పోలు వెంకన్న, దుండి మధుకర్, సూరయ్య,రవి, ముదిరాజ్ లు పాల్గొన్నారు.