ఈనెల 17న ఐ-సెట్‌

వరంగల్‌: ఈ నెల 17న ఐ-సెట్‌ పరీక్ష నిర్వహించనున్నట్లు కాకతీయ విశ్వవిద్యాయం (కేయూ) వీసీ వెంకటరత్నం పేర్కొన్నారు. లక్ష 39వేల మంది హజరవనున్న ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 256 పరీక్ష కేంద్రాలను ఏర్నాటు చేశారు. హల్‌ టీక్కెట్లు అందని వారు కేయూ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చునని ఆయన వివరించారు