ఈవీఎంలను గోనుపాడు పాలిటెక్నికల్ కళాశాల స్ట్రాంగ్ రూములకు తరలింపు -జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి

గద్వాల నడిగడ్డ, డిసెంబర్ 1 జనం సాక్షి.
ప్రియదర్శిని డిగ్రీ కళాశాల నుండి ఉదయంపోలింగ్ అనంతరం వచ్చిన ఈవీఎంలను పోలీసుభద్రత , వివిధ రాజకీయ పార్టీల ప్రతినిదుల అందరి అద్వర్యం లో సీల్ చేసి గోనుపాడు పాలిటెక్నిక్ కళాశాల స్ట్రాంగ్ రూమ్ కు తరలించడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు.ఈనెల 3న జరిగే ఎన్నికల లెక్కింపు కార్యక్రమానికి ఇ వి ఏం లను స్థానిక పోలీసులు, ఆర్మడ్ రిజర్వు, కేంద్ర బలగాలతో స్ట్రాంగ్ రూమ్ కు తరలించడం జరిగిందని తెలిపారు.కలెక్టర్ తో పటు గద్వాల రిటర్నింగ్ అధికారి అపుర్వ్ చౌహాన్ , గద్వాల తహసిల్దార్ నరేందర్ , పోలీస్ ,సంబంధిత అధికారులు ఉన్నారు.