ఈ నెల 24న దివ్యాంగులకు ప్రత్యేక వైద్య శిబిరం

వేమనపల్లి,నవంబర్ 18,(జనంసాక్షి)

వేమనపల్లి మండలంలోని దివ్యాంగ విద్యార్థులకు ఈనెల 24న మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు మండల విద్యాధికారి పోటు తిరుపతిరెడ్డి,నీల్వాయి సర్పంచ్ గాలిమధు ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ సమగ్ర శిక్ష హైదరాబాద్,భారత కృత్రిమ అవయవాల నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. అర్హులైన విద్యార్థులు ఆధార్ కార్డ్,ఆదాయ ధ్రువీకరణ పత్రం,రేషన్ కార్డ్,సదరం ధ్రువీకరణ పత్రం(సదరం ధ్రువీకరణ పత్రం లేనివారు) ప్రభుత్వ వైద్యుడు ధ్రువీకరణ పత్రం పొంది హెచ్ఎం,ఎంఈఓ ల ధ్రువీకరణ తీసుకోవాలి. వైకల్యం కనిపించే విధంగా ఉన్న ఫోటోలతో హాజరుకావాలని సూచించారు.ఇతర వివరాలకు మండల విలీన విద్య ఉపాధ్యాయుడు తోడే సమ్మయ్య(9885963451) లను సంప్రదించాలని సూచించారు.